Share News

వచ్చే ఐదేళ్లలో 8-10 కొత్త ట్రాక్టర్లు

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:25 AM

ఎస్కార్ట్స్‌ కుబోటా.. దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా పవర్‌ట్రాక్‌ శౌర్య ట్రాక్టర్‌ను తీసుకువచ్చింది. సౌత్‌ స్పెషల్‌ ప్యాడీ ట్రాక్టర్‌ సిరీ్‌సతో దీన్ని తీసుకువచ్చినట్లు సంస్థ సీఎండీ నిఖిల్‌ నందా...

వచ్చే ఐదేళ్లలో 8-10 కొత్త ట్రాక్టర్లు

  • మార్కెట్లోకి పవర్‌ట్రాక్‌ శౌర్య ట్రాక్టర్‌

  • దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా తయారీ

  • ఎస్కార్ట్స్‌ కుబోటా సీఎండీ నిఖిల్‌ నందా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎస్కార్ట్స్‌ కుబోటా.. దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా పవర్‌ట్రాక్‌ శౌర్య ట్రాక్టర్‌ను తీసుకువచ్చింది. సౌత్‌ స్పెషల్‌ ప్యాడీ ట్రాక్టర్‌ సిరీ్‌సతో దీన్ని తీసుకువచ్చినట్లు సంస్థ సీఎండీ నిఖిల్‌ నందా తెలిపారు. మంగళవారం నాడిక్కడ మార్కెట్లోకి ఈ ట్రాక్టర్‌ విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి సాగులో కీలకంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కోసం శౌర్య సిరీస్‌ ట్రాక్టర్‌ను రూపొందించినట్లు చెప్పారు. వరి సాగుకు సంబంధించి అన్ని రకాలైన భూములకు ఈ ట్రాక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. 39 హెచ్‌పీ నుంచి 52 హెచ్‌పీ శ్రేణిలో అందుబాటులో ఉండనున్న ఈ ట్రాక్టర్‌ ధరల శ్రేణి రూ.5.75 లక్షల నుంచి రూ.7.30 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉండనున్నాయని నందా తెలిపారు. రానున్న 4-5 నెలల్లో మరొక ట్రాక్టర్‌ను దక్షిణాది మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. కాగా కంపెనీ ప్రస్తుతం పవర్‌ట్రాక్‌, ఫార్మ్‌ట్రాక్‌, కుబోటా బ్రాండ్స్‌తో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను తయారు చేస్తోందన్నారు. అంతేకాకుండా వచ్చే ఐదేళ్లలో ఈ మూడు బ్రాండ్స్‌లో కొత్తగా 8 నుంచి 10 ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు నందా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డిప్యూటీ ఎండీ అకీరా కాటో, సీఎ్‌ఫఓ భరత్‌ మదన్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 01:25 AM