పెట్టుబడులు, వృద్ధి పైనే ఫోకస్
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:12 AM
పెట్టుబడులు ప్రాధాన్య సాధనంగా ఆర్థిక వృద్ధిని పెంచడంపై ‘బడ్జెట్ 2026-27’ దృష్టి సారించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అలాగే ప్రభుత్వం వృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: పెట్టుబడులు ప్రాధాన్య సాధనంగా ఆర్థిక వృద్ధిని పెంచడంపై ‘బడ్జెట్ 2026-27’ దృష్టి సారించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అలాగే ప్రభుత్వం వృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నదని ద్రవ్యలోటు నియంత్రణ లక్ష్యం తెలుపుతుందన్నారు. బడ్జెట్ విశేషాలను పంచుకునేందుకు సోమవారం మీడియా తో సమావేశంలో ఆమె ప్రస్తావించిన ముఖ్యాంశాలు..
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగానే బంగారం ధరలు తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతున్నాయి. ఆర్బీఐతోపాటు చాలా దేశాల సెంట్రల్ బ్యాంక్లు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. ఏ దేశ కరెన్సీపైనా నమ్మకం లేకపోవడం వల్లే ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలుకు ఎగబడుతున్నారు.
డెరివేటివ్ ట్రేడింగ్లో స్పెక్యులేషన్ను తగ్గించేందుకే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) పెంచాం. ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో తమ పిల్లలు డబ్బులు పోగొట్టుకుంటున్నారని, ప్రభుత్వం కలుగ జేసుకోవాలని చాలా మంది తల్లిదండ్రులు నాకు ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదు చేశారు.
ఈసారి ప్రభుత్వ ప్రాధాన్యం వృద్ధి. ద్రవ్యలోటును జీడీపీలో 4.3 శాతానికి కట్టడి చేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణను కొనసాగిస్తాం. ఐడీబీఐ బ్యాంక్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలో ఉంది.
జీఎ్సటీ రేట్ల తగ్గింపు, వ్యక్తిగత ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి పెంపుతో పెరిగిన వినియోగం మున్ముందూ కొనసాగుతుందన్న నమ్మకం ఉంది.
బడ్జెట్ సెషన్ ద్వితీయార్ధంలో ఐబీసీ సవరణ బిల్లు
ఈ మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సెషన్ ద్వితీయార్ధంలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) సవరణ బిల్లు, 2025ను ప్రవేశపెట్టనున్నట్లు సీతారామన్ తెలిపారు. ఈ బిల్లుపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ తన నివేదిక ఇప్పటికే సమర్పించిందన్నారు. దివాలా స్మృతి చట్టంలో ప్రతిపాదించిన సవరణలు దివాలా పరిష్కార చర్యలను వేగవంతం, సమర్థవంతం చేయడంతోపాటు చట్టాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
అత్యాశకు పోయి.. రూ.10 లక్షల అప్పు చేసి పసిడి కొంటే..
బంగారం @ 9 వేలు, వెండి @ 50 వేలు.. భారీగా పతనమైన ధరలు..