జూలై 1 నుంచి బీఎండబ్ల్యూ కార్ల ధరల పెంపు
ABN , Publish Date - Jun 09 , 2026 | 02:49 AM
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తమ అన్ని బీఎండబ్ల్యూ, మినీ కార్ల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్టు బీఎండబ్ల్యూ గ్రూప్...
ముంబై: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తమ అన్ని బీఎండబ్ల్యూ, మినీ కార్ల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్టు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా సోమవారం వెల్లడించింది. స్థానికంగా ఉత్పత్తి చేసిన, కంప్లీట్లీ బిల్ట్ అప్ (సీబీయూ) రూపంలోని బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లకు ఈ ధరల పెంపు వర్తిస్తుందని పేర్కొంది. రూపాయి క్షీణత, పెరుగుతున్న లాజిస్టిక్స్ వ్యయాలు వంటి స్థూల ఆర్థిక ప్రతికూలతలను తట్టుకునేందుకు 2 శాతం వరకు ధరలను పెంచుతున్నట్టు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు
16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల
Read AP News Latest, Telangana News And National News