డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్లలోకి అమర రాజా
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:15 AM
మిషన్ క్రిటికల్ డిఫెన్స్ ఎలకా్ట్రనిక్స్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు అమరరాజా గ్రూప్నకు చెందిన స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ ఆర్ అండ్ డీ కంపెనీ అమర రాజా డిజైన్ ఆల్ఫా...
ముంబై: మిషన్ క్రిటికల్ డిఫెన్స్ ఎలకా్ట్రనిక్స్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు అమరరాజా గ్రూప్నకు చెందిన స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ ఆర్ అండ్ డీ కంపెనీ అమర రాజా డిజైన్ ఆల్ఫా (ఏఆర్డీఏ) డిఫెన్స్ బుధవారం ప్రకటించింది. అలాగే, నౌకా దళ సోనార్ వ్యవస్థ కోసం పవర్ కండీషనింగ్ క్యాబినెట్ను (పీసీసీ) దేశీయంగా అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. తదుపరి దశలో నావల్ సోనార్ సిస్టమ్స్ కోసం పవర్ యాంప్లిఫైయర్ డిజైన్, సిగ్నల్ ఇంటర్ఫేసెస్, పవర్ యాంప్లిఫైయర్ క్యాబినెట్స్ అభివృద్ధిలోకి కూడా విస్తరించనున్నట్లు సంస్థ వెల్లడించింది. భారత నౌకా దళ స్వదేశీకరణ ప్రయత్నాల్లో ప్రైవేట్ రంగం నుంచి తమ వంతు పాత్ర పోషించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..