24.64 లక్షల ఐటీ రిటర్న్ల పెండింగ్
ABN , Publish Date - Feb 12 , 2026 | 05:50 AM
ఐటీ రిటర్న్ల వ్యవస్థను ఎంతగా ఆధునికం చేసినా రిటర్న్ల ప్రాసెసింగ్లో జాప్యం కొనసాగుతూనే ఉంది. 2025-26 పన్ను మదింపు సంవత్సరానికి సంబంధించి...
న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్ల వ్యవస్థను ఎంతగా ఆధునికం చేసినా రిటర్న్ల ప్రాసెసింగ్లో జాప్యం కొనసాగుతూనే ఉంది. 2025-26 పన్ను మదింపు సంవత్సరానికి సంబంధించి ఈ నెల 4వ తేదీ నాటికి 8.8 కోట్ల ఐటీ రిటర్న్లు ఫైల్ అయ్యాయి. నిబంధనల ప్రకారం ఐటీ అధికారులు వీటిని మూడు నెలల్లోగా పరిశీలించి రిఫండ్స్ ఏమైనా ఉంటే, వాటిని పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో జమ చేయాలి. అయితే 90 రోజుల గడువు ముగిసినా 24.64 లక్షల రిటర్న్ల పరిశీలన ఇంకా పూర్తికాలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు.
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.19.44 లక్షల కోట్లు: కేంద్ర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జోరందకున్నాయి. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.19.44 లక్షల కోట్లు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 9.4% ఎక్కువ. కార్పొరేట్ పన్ను వసూళ్లు నికరంగా 14.51 శాతం పెరిగి
ఇవి కూడా చదవండి..
దేశాన్ని అమ్మేశారు.. అమెరికాతో డ్రేల్ డీల్పై రాహుల్ గాంధీ
మన డేటా రక్షణకు చర్యలేవీ.. కేంద్రంపై రాహుల్ ప్రశ్నల వర్షం