భద్రతా ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Mar 12 , 2026 | 01:12 AM
పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి, జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో భద్రతా ఏర్పాట్లను ఏఎస్పీ కృష్ణ మోహన్, డీఎస్పీ భార్గవి పరిశీలించారు.
ఎమ్మిగనూరు టౌన్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి, జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో భద్రతా ఏర్పాట్లను ఏఎస్పీ కృష్ణ మోహన్, డీఎస్పీ భార్గవి పరిశీలించారు. బుధవారం కోర్టు సూపరింటెండెంట్ విష్ణుప్రియతో కలసి కోర్ట్టులోని రికార్డుల రూము, న్యాయాధికారి భద్రతలను పరిశీలించారు. ఈ మధ్య కాలంలో కోర్టులో జరుగుతున్న దాడుల దృష్టిలో ఉంచుకొని కోర్టు ప్రహరీ, లాయర్ల, సాక్షులపై జరుగుతున్న దాడుల దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. సీఐ శ్రీనివాసులు, ఎస్సై మధుసూదన్రెడ్డి, ఆర్అండ్బీ డీఈ నాగరాజు, సూపర్వైజర్ ప్రభు, ఎలక్ర్టిక్ డీఈ నాగేంద్రప్రసాద్, ఏఈ ప్రసన్నరాజు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.