క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:51 AM
గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్రీయ బాలస్వాస్థ్య నోడల్ అధికారి, జిల్లా ఎన్సీడీ నోడల్ అధికారి డా.మహేశ్వరప్రసాద్ సూచించారు.
మద్దికెర, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్రీయ బాలస్వాస్థ్య నోడల్ అధికారి, జిల్లా ఎన్సీడీ నోడల్ అధికారి డా.మహేశ్వరప్రసాద్ సూచించారు. గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. హెల్త్ ప్రొవైడర్లు, ఆరోగ్య, ఆశా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. వైద్యాధికారి శ్రీలక్ష్మి, రాగిణి, వైద్యసిబ్బంది నిరంజన్ బాబు, అక్బర్ బాషా, కృష్ణమ్మ, సూర్యనారాయణ ఉన్నారు.