Share News

చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Mar 12 , 2026 | 01:11 AM

ఆరేకల్లు గ్రామానికి చెందిన తలారి ఎ.హుసేనిపై అదే గ్రామానికి చెందిన నరసప్ప దాడి చేశాడని, చర్యలు తీసుకోవాలని వీఆర్‌ఏ సంఘం నాయకులు కృష్ణ, వీరేశ్‌, వీఆర్‌ఏలు కోరారు.

చర్యలు తీసుకోవాలి
జేసీకి వినతిపత్రం అందజేస్తున్న వీఆర్‌ఏలు

ఆదోని రూరల్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఆరేకల్లు గ్రామానికి చెందిన తలారి ఎ.హుసేనిపై అదే గ్రామానికి చెందిన నరసప్ప దాడి చేశాడని, చర్యలు తీసుకోవాలని వీఆర్‌ఏ సంఘం నాయకులు కృష్ణ, వీరేశ్‌, వీఆర్‌ఏలు కోరారు. నరసప్ప సీసీ రోడ్డుపై ఇల్లు నిర్మిస్తున్నాడని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ ఇంటిని ఫొటో తీస్తుండగా దాడి చేశాడని తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ నూరల్‌ ఖమర్‌, సబ్‌ కలెక్టర్‌ అజయ్‌ కుమార్‌, తహసీల్దార్‌ శేషఫణి, తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న వీఆర్‌ఏపై దాడి చేయడం దారుణమన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 01:11 AM