భార్య చేతులు కట్టేసి కొట్టిన భర్త..అదుపులోకి తీసుకున్న పోలీసులు
ABN , Publish Date - Sep 17 , 2025 | 03:17 PM
ప్రకాశం జిల్లాలోని కలుజువ్వలపాడులో భార్యను భర్త తాళ్లతో కట్టేసి.. అతి కిరాతకంగా హింసించిన ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది.
ఒంగోలు, సెప్టెంబర్ 17: ప్రకాశం జిల్లాలోని కలుజువ్వలపాడులో భార్యను భర్త తాళ్లతో కట్టేసి.. అతి కిరాతకంగా హింసించిన ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. అందులో భాగంగా దర్శి డీఎస్పీ లక్ష్మీ నారాయణ స్పందించారు. ఆయన ఆదేశాలతో సీఐ వెంకటేశ్వర్లు.. తన సిబ్బందితో కలిసి కలుజవ్వలపాడుకు చేరుకున్నారు. అనంతరం బాధిత మహిళను మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె భర్తతోపాటు అతడి ప్రియురాలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దీంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
మళ్లీ ఆల్ టైం హైకి చేరిన బంగారం,వెండి ధరలు
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..