భోజనం తినిపించిన రాహుల్ గాంధీ..
ABN, Publish Date - Jan 14 , 2025 | 04:49 PM
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోని రిథాలా (Rithala) ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని రిథాలా (Rithala) ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి, స్థానిక సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పార్కులో వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పలువురికి స్వయంగా భోజనం తినిపించారు. దీంతో వారంతా భావోద్వేగానికి లోనైయ్యారు. తమతో కలిసి రాహుల్ భోజనం చేయడంపై స్థానికులంతా హర్షం వ్యక్తం చేశారు. కాగా, రాహుల్ గాంధీ వారితో ఆనందంగా గడిపారు.
Updated at - Jan 14 , 2025 | 04:49 PM