అతిపెద్ద రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ..

ABN, Publish Date - Nov 29 , 2025 | 08:13 AM

గోవాలో జరిగిన శ్రీ సంస్థాన్‌ గోకర్ణ జీవోత్తమ మఠం 550వ వార్షికోత్సవాల్లో నిన్న(శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 77అడుగుల ఎత్తయిన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

గోవా: గోవాలో జరిగిన శ్రీ సంస్థాన్‌ గోకర్ణ జీవోత్తమ మఠం 550వ వార్షికోత్సవాల్లో నిన్న(శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 77అడుగుల ఎత్తయిన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. దక్షిణ గోవాలోని పర్తగలి మఠాన్ని సందర్శించిన అనంతరం మోదీ ప్రసంగించారు. ప్రపంచంలోనే ఎత్తయిన రాముడి విగ్రహం ఇదేనని మోదీ కొనియాడారు. ప్రజల్లో ఐక్యత ద్వారానే వికసిత్‌ భారత్‌ సాధ్యమని.. నేడు భారత్‌ సాంస్కృతిక పునరుజ్జీవన దశలో ఉందని తెలిపారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం, ఉజ్జయినిలో మహాకాళ్‌ మహాలోక్‌ విస్తరణ, కాశీ విశ్వనాథ్‌ థామ్‌ పునరుద్ధరణ వంటివన్నీ అందుకు ఉదాహరణలుగా చెప్పుకొచ్చారు.

Updated at - Nov 29 , 2025 | 08:13 AM