పేర్ని నాని గోదాం లో మైనింగ్ అధికారుల తనిఖీలు

ABN, Publish Date - Jan 02 , 2025 | 09:28 PM

మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో మైన్స్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. పోట్లపాలెం గ్రామంలోని మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాములను మైన్స్ అధికారులు పరిశీలించారు. గోదాముల నిర్మాణ సమయంలో సైతం అనేక అక్రమాలకు పాల్పడినట్లు మైన్స్ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో అక్కడికి చేరుకున్న మైనింగ్ అధికారులు.. గోదాములకు తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు.

మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో మైన్స్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. పోట్లపాలెం గ్రామంలోని మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాములను మైన్స్ అధికారులు పరిశీలించారు. గోదాముల నిర్మాణ సమయంలో సైతం అనేక అక్రమాలకు పాల్పడినట్లు మైన్స్ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో అక్కడికి చేరుకున్న మైనింగ్ అధికారులు.. గోదాములకు తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు.


దీంతో ఈ అంశంపై వారు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ గోదాముల నిర్మాణ సంమయంలో అక్రమంగా మట్టిని తొలినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో ఆయా అంశాలను సైతం మైనింగ్ అధికారులు పరిశీలించారు. ఓవైపు రేషన్ బియ్యం మాయం.. మరోవైపు అక్రమ మట్టి తరలింపు అంశాల్లో పేర్ని నానిని మైనింగ్ అధికారులు ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 02 , 2025 | 09:41 PM