వీరజవాన్ మురళీ నాయక్‌కు లోకేష్ నివాళి

ABN, Publish Date - May 11 , 2025 | 09:58 AM

Operation Sindoor: శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కళ్లితండాలో అమరజవాను అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. అధికార లాంఛనాలతో అగ్నివీర్ మురళీ నాయక్ అంత్యక్రియలు ప్రభుత్వం నిర్వహించనుంది.

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌ (Operation Sindoor)లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన అగ్నివీర్‌ (Agniveer) జవాన్‌ మురళీ నాయక్‌ (Murali Naik) పార్థివదేహానికి మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) నివాళులర్పించారు (Tribute). మురళీ నాయక్ స్వగ్రామం కిళ్లితండా గ్రామానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ఈ మేరకు నివాళులు అర్పించారు. ఆయన వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, ఎంపీ బీకే పార్థసారథి తదితరులు ఉన్నారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మురళీ నాయక్‌ అంత్యక్రియల్లో పాల్గొంటారు. ఇప్పటికే ఆయన సత్యాసాయి జిల్లాకు చేరుకున్నారు.

Also Read: మోహినీ అలంకరణలో చిన్న వెంకన్న..


శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కళ్లితండాలో అమరజవాను అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. అధికార లాంఛనాలతో అగ్నివీర్ మురళీ నాయక్ అంత్యక్రియలు ప్రభుత్వం నిర్వహించనుంది. గురువారం రాత్రి జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో అగ్నివీర్ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

పాకిస్తాన్ వక్రబుద్ధి.. నమ్మక ద్రోహం...

Minister Lokesh: సృష్టిలో అమ్మకు మించిన అద్భుతం లేదు

For More AP News and Telugu News


ఈ అద్భుతం చూడండి...

Updated at - May 11 , 2025 | 10:07 AM