శివనామస్మరణతో మార్మోగుతున్న పంచారామ క్షేత్రాలు..

ABN, Publish Date - Feb 26 , 2025 | 08:59 AM

శ్రీశైలం: మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు తరలివెళ్లారు. భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు.

శ్రీశైలం: మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు తరలివెళ్లారు. భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయానికీ భక్తులు పెద్దసంఖ్యలో తరలివెళ్తున్నారు. కాగా, ఆలయంలో వేకువజాము నుంచే పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ భ్రమరాంబ, మల్లిఖార్జునస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తున్నారు. కాగా, భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ తలెత్తకుండా పోలీసులు సైతం చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్‍లో మహాకుంభమేళా ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా వెళ్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Army plane crash: ఆ దేశంలో ఘోర ప్రమాదం.. కళ్లుమూసి తెరిచే లోపే..

KSRTC bus conductor: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య తిరగని సర్వీసులు

Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధరలు..

Updated at - Feb 26 , 2025 | 09:01 AM