గ్రీస్ అమ్మాయిని పెళ్లాడిన ఇండియన్..
ABN, Publish Date - Jan 29 , 2025 | 02:23 PM
ఉత్తర్ ప్రదేశ్: ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో మరో వార్త వైరల్ అయ్యింది. గ్రీస్ అమ్మాయిని ఇండియన్ అబ్బాయి వివాహం చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఉత్తర్ ప్రదేశ్: ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళ ఘనంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. ఇప్పటికే 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ మోనాలిసా అనే యువతి అందరినీ తన అందంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారారు. అలాగే కర్నాటకకు చెందిన దంపతులు సైతం కారునే ఇల్లుగా మార్చుకుని వైరల్ అయ్యారు. తాజాగా ప్రయాగ్ రాజ్లో మరో ఇంట్రెస్టింగ్ సంఘటన చోటు చేసుకుంది. గ్రీస్ అమ్మాయి, ఇండియన్ అబ్బాయి వివాహం హాట్ టాపిక్గా మారింది.
Updated at - Jan 29 , 2025 | 02:27 PM