జైలుకు వెళ్లిన వైఎస్ జగన్..
ABN, Publish Date - Feb 18 , 2025 | 01:21 PM
అమరావతి: విజయవాడ జైలులో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలిశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సాక్ష్యులను బెదిరించారన్న కేసులో అరెస్టయిన వంశీని జగన్ పరామర్శించారు.
అమరావతి: విజయవాడ జైలులో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కలిశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సాక్ష్యులను బెదిరించారన్న కేసులో అరెస్టయిన వంశీని జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా విజయవాడ జైలుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా, వైసీపీ శ్రేణులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడున్న బ్యారీకేడ్లను తోసుకుంటూ జైలు ప్రాంగణంలోకి వెళ్లారు. ఎట్టకేలకు వారిని అడ్డుకుని జగన్ ఒక్కడినే వంశీని కలిసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
Updated at - Feb 18 , 2025 | 01:21 PM