Kedar Selagamsetty: తెలుగు నిర్మాత కేదార్ దుబాయ్లో మృతి
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:03 AM
ఇది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారమే కానీ ఇంతవరకు అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. ఆనంద్ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన గం గం గణేషా చిత్రం ఆయన నిర్మించిందే.
ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న తర్వాత విషాదం
అల్లు అర్జున్, విజయ దేవరకొండ సన్నిహితుడు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): టాలీవుడ్ యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి మంగళవారం దుబాయ్లో ఆకస్మికంగా మృతి చెందారు. ఇది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారమే కానీ ఇంతవరకు అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. ఆనంద్ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన గం గం గణేషా చిత్రం ఆయన నిర్మించిందే. టాలీవుడ్ సినీ ఫైనాన్షియర్ కుమారుడి వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకకు పరిశ్రమలోని ముఖ్యులు అనేకులు హాజరైన తరుణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ వేడుకకు తోడు దుబైలో సోమవారం రాత్రి మిత్రులతో పార్టీకి హాజరైన కేదార్ అనంతరం తన ఫ్లాట్లో నిద్రపోయాడు. నిద్రలోనే తాను మృతి చెందాడని సమాచారం. తన మరణానికి అనారోగ్యమా? మరింకేమైనా కారణం ఉందా? తేలాల్సి ఉంది. కేదార్ నిద్రించిన ఫ్లాట్లోనే తెలంగాణకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే కూడా బస చేసినట్లు సమాచారం. ఆ మాజీ ఎమ్మెల్యేను దుబాయి పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు ధ్రువీకరించని సమాచా రం. సరిగ్గా ఏడాది క్రితం గచ్చిబౌలి పరిఽధిలోని రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు ఇచ్చిన కొకైన్ పార్టీకి కేదార్తో పాటు.. కొందరు సినీ ప్రముఖులు, దర్శకుడు క్రిష్, ఇండస్ట్రీకి చెందిన జూనియర్ మహిళా ఆర్టిస్టులు సైతం హాజరయ్యారని అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News