Share News

టీజీఎడ్‌సెట్‌లో 30,944 మంది ఉత్తీర్ణత

ABN , Publish Date - Jun 22 , 2025 | 05:15 AM

బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. శనివారం తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన ఫలితాల విడుదల

టీజీఎడ్‌సెట్‌లో 30,944 మంది ఉత్తీర్ణత

హైదరాబాద్‌, చాంద్రాయణగుట్ట, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. శనివారం తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన ఫలితాల విడుదల కార్యక్రమంలో మండలి చైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి, కాకతీయ వర్సిటీ ఉపకులపతి, ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె.ప్రతాప్‌ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌1న నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 32,106 మంది హాజరవ్వగా 30,944 మంది (96.38ు) అర్హత సాధించారు.


హైదరాబాద్‌ పాతబస్తీ గౌలిపురాకు చెందిన విజ్జా గణపతిశాస్త్రీ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఇంతకు ముందు ఈయన గ్రూప్‌-1లో 269వ ర్యాంకు సాధించారు.గ్రూప్‌-1 అఽధికారిగా అవకాశం వచ్చే ఉన్నందున గ్రూప్‌-1నే ఎంచుకుంటానని ఆయన తెలిపారు.

Updated Date - Jun 22 , 2025 | 05:15 AM