TG TET 2025: 18 నుంచి టీజీటెట్
ABN , Publish Date - Jun 05 , 2025 | 04:33 AM
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లను ఈ నెల 18 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లను ఈ నెల 18 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11:30 గంటలవరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమంలో నిర్వహించనున్నారు.