Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:41 AM
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ప్రకటించింది.

రీకౌంటింగ్కు 15 రోజుల గడువు
పలువురికి 60% దాటిన మార్కులు
నేడు గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల
హైదరాబాద్, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ప్రకటించింది. ఫలితాలను అభ్యర్థులు టీజీపీఎ్ససీ అధికారిక వెబ్సైట్లో తమ వ్యక్తిగత లాగిన్లో చూసుకోవచ్చు. ఈనెల 16 సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థులు మార్కులను చూసుకోవచ్చని, డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. రీకౌంటింగ్కు 15 రోజుల గడువు ఇచ్చారు. దీనికోసం ప్రతి పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో పలువురికి 60ు మార్కులు దాటి వచ్చాయని తెలిసింది.
సోమవారం సాయంత్రం వరకు అందించిన సమాచారం మేరకు హన్మకొండ విద్యానగర్కు చెందిన జిన్న తేజస్విని 532.5 మార్కులు సాధించారు. జనరల్ ఎస్సేలో 79.5, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీలో 102, ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్లో 89.5, ఎకానమీ అండ్ డెవల్పమెంట్లో 113.5, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రెటేషన్లో 68, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో 80 మార్కులు సాధించారు. అర్హత పరీక్ష జనరల్ ఇంగ్లి్షలో తేజస్విని 150కి 121 మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించినవారి వివరాలపై రీకౌంటింగ్ గడువు ముగిశాక 15 రోజుల తర్వాత స్పష్టత రానుంది. టీజీపీఎ్ససీ ముందుగా ప్రకటించిన ప్రకారం గ్రూప్-2 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను నేడు విడుదల చేయనుంది. అలాగే గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితాను మార్చి 14న విడుదల చేయనున్నారు.