Share News

Agriculture Urea Supply: ఆగస్టులో యూరియా వినియోగం ఎక్కువ

ABN , Publish Date - Aug 06 , 2025 | 03:55 AM

ష్ట్రంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకొని తగినంత యూరియా సరఫరా చేయాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Agriculture Urea Supply: ఆగస్టులో యూరియా వినియోగం ఎక్కువ

  • పాత బకాయిలతోపాటు ఈనెల కోటానూ ఇవ్వాలి

  • కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకొని తగినంత యూరియా సరఫరా చేయాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ నెలలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న లాంటి పంటలకు యూరియాను పైపాటుగా వాడుతారని, ఇలాంటి పరిస్థితుల్లో యూరియా సరఫరాలో ఎలాంటి ఆలస్యం తలెత్తినా పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాత బకాయిలతో పాటు ఈనెల కోటా యూరియాను కూడా సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Aug 06 , 2025 | 03:55 AM