CM Revanth Reddy: సీఎంను కలిసిన రాహుల్ సిప్లిగంజ్, అందెశ్రీ
ABN , Publish Date - Aug 15 , 2025 | 03:53 AM
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం ఇటీవల ఆయనకు 1 కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం జూబ్లీహిల్స్లోని అధికారిక నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి కృత జ్ఞతలు తెలిపారు. మరోవైపు ప్రముఖ కవి అందెశ్రీ కూడా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.