Singareni: జైపూర్లో సింగరేణి మరో విద్యుత్ కేంద్రం
ABN , Publish Date - Mar 12 , 2025 | 04:06 AM
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో 800 మెగావాట్లతో మరో ప్లాంట్ నిర్మించేందు సింగరేణి సిద్ధమవుతోంది.

రూ.6,700 కోట్లతో 800 మెగావాట్ల యూనిట్
నాలుగేళ్లలో కట్టేలా బీహెచ్ఈఎల్తో ఒప్పందం
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో 800 మెగావాట్లతో మరో ప్లాంట్ నిర్మించేందు సింగరేణి సిద్ధమవుతోంది. రూ.6,700 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకుంది. గత ఫిబ్రవరిలోనే ఈ కాంట్రాక్ట్ను బీహెచ్ఈఎల్ దక్కించుకోగా.. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సోమవారం ఒప్పంద పత్రాలపై సింగరేణి, బీహెచ్ఈఎల్ సంతకాలు చేశాయి.
ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బలరామ్, బీహెచ్ఈఎల్ జీఎం పార్థసారథి దాస్ పాల్గొన్నారు. నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒప్పందం ఉన్నప్పటికీ.. 40 నెలల్లోనే ప్లాంట్ను అందుబాటులోకి తేవాలని సింగరేణి సీఎండీ బలరామ్ స్పష్టం చేశారు.