Carnivorous Plant: పెంచికలపేట అడవుల్లో కీటకాహార మొక్కలు
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:11 AM
కుమరం భీం జిల్లా పెంచికలపేట అడవుల్లో అటవీ శాఖ అధికారులు అరుదైన కీటక ఆహార మొక్కలను కనుగొన్నారు.
డ్రోసెరా బర్మనీ రకం జాతిగా గుర్తింపు
పెంచికలపేట, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లా పెంచికలపేట అడవుల్లో అటవీ శాఖ అధికారులు అరుదైన కీటక ఆహార మొక్కలను కనుగొన్నారు. డ్రోసెరా బర్మనీ రకం వృక్ష జాతిగా దీనిని గుర్తించారు. ఈ మొక్కల ఆకులపై ఉండే వెంట్రుకల లాంటి నిర్మాణాలు జిగురును స్రవిస్తాయి. ఇవి కీటకాలను ఆకర్షిస్తాయి. చిన్న చిన్న పురుగులు వాలగానే వాటిని బంధిస్తాయి. మొక్క ఆ కీటకాలను జీర్ణం చేసుకుంటుంది. దీనిపై ఎఫ్ఆర్వో అనిల్ కుమార్ను వివరణ కోరగా.. అరుదైన కీటక ఆహార మొక్కలు పెంచికలపేట రేంజ్ పరిధిలో కనిపించడం ప్రత్యేకమని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News