గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం
ABN , Publish Date - Jan 29 , 2025 | 12:20 AM
గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మేడ్చల్ టౌన్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ పోలీ్సస్టేషన్ పరిధిలోని మునీరాబాద్ గ్రామశివారులో గల జేబీ హోమ్ డెయిరీ ఫామ్ సమీపంలో గుర్తుతెలియని సుమారు 60ఏళ్ల వృద్ధుడి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఎరుపు రంగు షర్టు, బ్లూ ప్యాంటు ధరించినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.