మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:19 AM
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను కేశంపేట పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.

కేశంపేట, జనవరి15 (ఆంధ్రజ్యోతి): అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను కేశంపేట పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. మండల పరిధిలోని కాకునూర్ గ్రామ శివారులోని మహాలింగేశ్వర స్వామి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. వాగు నుంచి మూడు ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ యాజమానులు కమ్మరి నర్సింహాచారి, శాంత య్య, కర్రోళ్ల రాజులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేశంపేట సీఐ నరహరి తెలిపారు. ఎవరైనా సరే అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.