Share News

క్రీడలతో మానసికోల్లాసం

ABN , Publish Date - Jan 22 , 2025 | 12:06 AM

క్రీడలతో మానసికోల్లాసం, శారీరక ధారుఢ్యం పెరుగుతుందని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ రెడ్డి అన్నారు. మంగళవారం కొందుర్గు మండల పరిధిలోని ఆగిర్యాలలో ఏపీఎల్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-2 క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు.

క్రీడలతో మానసికోల్లాసం
క్రీడాకారులతో కరచాలనం చేస్తున్న ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ రెడ్డి

చౌదరిగూడ, జనవరి 21(ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసికోల్లాసం, శారీరక ధారుఢ్యం పెరుగుతుందని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ రెడ్డి అన్నారు. మంగళవారం కొందుర్గు మండల పరిధిలోని ఆగిర్యాలలో ఏపీఎల్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-2 క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు. కొందుర్గు మాజీ వైస్‌ ఎంపీపీ రాజేష్‌ పటేల్‌, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, రామకృష్ణ, గోపాల్‌, బీమయ్య, శేఖర్‌, బల్వంత్‌రెడ్డి, రాంచంద్రయ్యలతోపాటు, ఆర్గనైజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2025 | 12:06 AM