లగచర్ల నిందితుడు సురేశ్రాజ్ విడుదల
ABN , Publish Date - Jan 29 , 2025 | 12:19 AM
దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో గత నవంబరు 11న జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.
కొడంగల్/దుద్యాల్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో గత నవంబరు 11న జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో ఏ2గా నిందితుడిగా ఉన్న బోగమోని సురేశ్రాజ్ మంగళవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యాడు. నిందితుడు సురేశ్రాజ్ దాడి జరిగిన తర్వాత కొన్ని రోజులపాటు పరారీలో ఉండి నవంబరు 19న కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు. ఆ తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకొని సురేశ్రాజ్ను విచారించారు. 71రోజుల పాటు జైలులో ఉన్న సురేశ్రాజ్కు మంగళవారం హైకోర్టు ఇచ్చిన బెయిల్తో విడుదలయ్యాడు.