వ్యక్తి అదృశ్యం
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:31 AM
ఓవ్యక్తి అదృశ్యమైన ఘటన సోమవారం కీసర పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కీసర రూరల్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఓవ్యక్తి అదృశ్యమైన ఘటన సోమవారం కీసర పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకటయ్య వివరాల ప్రకారం.. నాగారంలోని ఓల్డ్ విలేజ్లో ఉండే కుమ్మరి భాస్కర్ పెయింటింగ్ వర్క్చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. కాగా సెల్ఫోన్ను ఇంట్లోనే వదిలేసి ఉదయం ఇంటి నుంచి బయల్దేరి వెళ్లాడు. అనంతరం సాయంత్రం తాను కుషాయిగూడ కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నానని, సరుకులు తీసుకువస్తున్నానని గుర్తుతెలియని ఫోన్ నంబర్ నుంచి ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. అప్పటి నుంచి బంధువుల వద్ద, మిత్రుల వద్ద, తెలిసినా వారి వద్ద వెతికినా భాస్కర్ ఆచూకీ లభించలేదు. దీంతో భయబ్రాంతులకు గురైన అతడి భార్య కుమ్మరి అర్చన కీసర పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.