Share News

గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:15 AM

మండల పరిధి ఎమ్‌ఎ్‌సఎన్‌ పరిశ్రమ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. చనిపోయిన వ్యక్తి నందిగామ మండలం బైపాస్‌ రోడ్డులో బిక్షాటన చేస్తూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. శుక్రవారం ఎమ్‌ఎ్‌సఎన్‌ పరిశ్రమ శివారులోని బైపాస్‌ రోడ్డు పక్కన ఆ వ్యక్తి అచేతన స్థితిలో ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

నందిగామ, జనవరి 3(ఆంధ్రజ్యోతి): మండల పరిధి ఎమ్‌ఎ్‌సఎన్‌ పరిశ్రమ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. చనిపోయిన వ్యక్తి నందిగామ మండలం బైపాస్‌ రోడ్డులో బిక్షాటన చేస్తూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. శుక్రవారం ఎమ్‌ఎ్‌సఎన్‌ పరిశ్రమ శివారులోని బైపాస్‌ రోడ్డు పక్కన ఆ వ్యక్తి అచేతన స్థితిలో ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహంపై శరీరంపై ఎలాంటి దుస్తులు లేవని, వయస్సు 50 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపారు.

Updated Date - Jan 04 , 2025 | 12:15 AM