Share News

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Feb 01 , 2025 | 11:36 PM

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ట్రైనీ కలెక్టర్‌ ఉమాహారతి హెచ్చరించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మాట్లాడుతున్న ట్రెయినీ కలెక్టర్‌ ఉమాహారతి

బొంరాస్‌పేట్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ట్రైనీ కలెక్టర్‌ ఉమాహారతి హెచ్చరించారు. శనివారం బొంరాస్‌పేట్‌ మండల కేంద్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, కిషోర బాలికలకు అందించే పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలకు గుడ్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని టీచర్లు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సీడీపీవో రజనితో ఫోన్‌లో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. క్రమం తప్పకుండా కేంద్రాలకు పౌష్టికాహారం సరఫరా చేయాలని ఆదేశించారు.

Updated Date - Feb 01 , 2025 | 11:36 PM