Share News

అమెరికాలోనే పేపాల్‌ డాటా లీకేజీ!

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:08 AM

దిగ్గజ పేమెంట్‌ గేట్‌వే పేపాల్‌ వినియోగదారుల డాటా లీకేజీ అమెరికాలోనే జరిగినట్లు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) గుర్తించింది. దుబాయ్‌లో ఉంటున్న కైవన్‌ పటేల్‌ రూపేశ్‌కుమార్‌ అలియాస్‌ జాదూభాయ్‌.

అమెరికాలోనే పేపాల్‌ డాటా లీకేజీ!

  • గుజరాత్‌ కేసుకు మాదాపూర్‌తో లింకుందా?

  • అమెరికన్ల సమాచారాన్ని ఎలా సేకరించారు?

  • అమెరికన్‌ ఎంబసీకి సీఎ్‌సబీ సమాచారం

  • మనస్విని కస్టడీ కోసం కోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): దిగ్గజ పేమెంట్‌ గేట్‌వే పేపాల్‌ వినియోగదారుల డాటా లీకేజీ అమెరికాలోనే జరిగినట్లు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) గుర్తించింది. దుబాయ్‌లో ఉంటున్న కైవన్‌ పటేల్‌ రూపేశ్‌కుమార్‌ అలియాస్‌ జాదూభాయ్‌. అతని సోదరుడు విక్కీకి ఈ సమాచారం అమెరికా నుంచే చేరిందని నిర్ధారించింది. జాదూభాయ్‌ ద్వారా ఆ సమాచారాన్ని సేకరించిన గుజరాత్‌కు చెందిన ఆజాద్‌ అనే కేటుగాడు.. మాదాపూర్‌లో కాల్‌సెంటర్‌ నిర్వహించే మనస్వినికి ఆ వివరాలను అందించినట్లు తేల్చారు. సీఎ్‌సబీ ఈ మేరకు అమెరికా ఎంబసీకి వివరాలను అందజేసింది. డాటా ఫ్రాడ్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు అమెరికాకు చెందిన పేపాల్‌ ఖాతాదారుల సమాచారాన్ని కొల్లగొట్టినట్లు వివరించింది.


అయితే.. గత ఏడాది గుజరాత్‌లో కూడా ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆ కేసులో ఆజాద్‌ నిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు మాదాపూర్‌ కేసులో కూడా.. మనస్వినికి సమాచారం అందజేసింది ఆజాదే. దీంతో.. గుజరాత్‌-మాదాపూర్‌ కేసులకు లింకులున్నాయా? అనే కోణంలో సీఎ్‌సబీ దర్యాప్తు చేస్తోంది. మాదాపూర్‌లోని పత్రికానగర్‌లో ఎగ్జిటో సొల్యూషన్స్‌ పేరుతో మనస్విని కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..! ఈ కేసులో సీఎ్‌సబీ పోలీసులు మనస్వినితోపాటు.. 62 మంది కాల్‌సెంటర్‌ ఉద్యోగులను అరెస్టు చేశారు. కాగా.. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు మనస్వినితోపాటు.. 10 మంది కాల్‌సెంటర్‌ టీమ్‌లీడర్లను కస్టడీలోకి తీసుకుని, విచారించాలని సీఎ్‌సబీ నిర్ణయించింది. ఈ మేరకు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Updated Date - Mar 12 , 2025 | 05:08 AM