Narayana Student: అంతర్జాతీయ కెమిస్ర్టీ ఒలింపియాడ్లో నారాయణ విద్యార్థికి పతకం
ABN , Publish Date - Jul 16 , 2025 | 06:19 AM
అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్-2025లో నారాయణ విద్యార్థి బంగారు పతకం సాధించాడు.
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్-2025లో నారాయణ విద్యార్థి బంగారు పతకం సాధించాడు. యూఏఈలో ఇటివలే జరిగిన ఒలింపియాడ్లో తమ విద్యార్థి కుచ్చి సందీప్ విజయం సాధించడం తమకెంతో గర్వకారణమని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విజయం వెనక తమ విద్యాసంస్థ మద్దతు, అధ్యాపకుల ప్రోత్సాహం ఉందని ఈ సందర్భంగా కుచ్చి సందీప్ అన్నారు. జేఈఈ, నీట్తో పాటు జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్లలో తమ విద్యార్తులు సత్తా చాటుతున్నారని డైరెక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా బంగారు పతకం సాధించిన సందీ్పను వారు అభినందించారు.