నెలరోజులుగా పడిగాపులు కాస్తున్నాం

ABN , First Publish Date - 2025-05-29T00:44:45+05:30 IST

నెల రోజుల నుంచి ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పడిగాపులు కాస్తున్నాం, లారీల కొరత సాకుతో తీసుకెళ్లన ధాన్యం మొలకెత్తిన ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెలరోజులుగా పడిగాపులు కాస్తున్నాం
రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు

అర్వపల్లి, మే 28 (ఆంధ్రజ్యోతి): నెల రోజుల నుంచి ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పడిగాపులు కాస్తున్నాం, లారీల కొరత సాకుతో తీసుకెళ్లన ధాన్యం మొలకెత్తిన ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామంలోని మల్లంపల్లి-నకిరేకల్‌(365 నెంబరు) జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని నేటికీ కొనుగోలు చేయకపోవడంతో తడిసి ముద్దవుతోందన్నారు. మొలకెత్తి దెబ్బతింటోందన్నారు. ఎన్నడూలేనివిధంగా లారీల కొరత పేరుతో ధాన్యం కాంటా వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న సీఐ రఘువీరారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేయించారు. రాస్తారోకోతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో రైతులు గోసుల విజయ్‌, లక్ష్మీనర్సింహ, అంకిరెడ్డి రాజారాం, నాగార్జున, మల్లేష్‌, అయోధ్య, లక్ష్మమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2025-05-29T00:44:49+05:30 IST