Share News

జర్నలిస్టులు వృత్తి విలువలు పాటించాలి

ABN , Publish Date - Jan 22 , 2025 | 12:46 AM

జర్నలిస్టులు వృత్తి విలువలు పాటించాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు.

జర్నలిస్టులు వృత్తి విలువలు పాటించాలి
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు

భువనగిరి టౌన, జనవరి 21 (ఆంధ్రజ్యోతి)ః జర్నలిస్టులు వృత్తి విలువలు పాటించాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) 2025వ సంవత్సరం డైరీని అదనపు కలెక్టర్లు వీరారెడ్డి గంగాధర్‌తో కలిసి మంగళవారం భువనగిరిలో ఆవిష్కరించి మాట్లాడారు. జర్నలిస్టుల శ్రమతోనే పలు ప్రజా సమస్యలు వెలుగు చూస్తూ పరిష్కారానికి నోచుకుంటున్నాయన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై యూనియన ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో జగన, డీపీఆర్‌ఓ అరుంధతి, యూనియన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యంబ నర్సింహులు, పోతంశెట్టి కరుణాకర్‌, జర్నలిస్టులు, యూనియన నాయకులు మరాఠీ రవి, కందుకూరి సోమయ్య, మరికొండ మల్లేష్‌, పాశం నవీన, పాములపర్తి లక్ష్మీనారాయణ, బండారు జగదీష్‌, కిషన, నిమ్మల సురేష్‌, ఎండీ.జమాలుద్దీన పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2025 | 12:46 AM