కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం
ABN , Publish Date - Mar 04 , 2025 | 12:24 AM
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జానవెస్లీ అన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జానవెస్లీ
సూర్యాపేట సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జానవెస్లీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షనహాల్లో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో రైతు, కార్మిక, వ్యవసాయ కార్మికవర్గాలకు నిధుల కేటాయింపుల విషయంలో మొండిచేయి చూపిందన్నారు. ప్రధానంగా దళితు లు, బలహీన వర్గాలు, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయించలేదన్నారు. రైతులకు రూ.10 వేల కోట్లు, ఎరువులకు రూ.11వేల కోట్లు సబ్సిడీ తగ్గించారని ఆరోపించారు. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశా రు. రాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారెంటీల అమలుకు అనుగుణంగా కేటాయింపు లు ఉండాలని కోరారు. ఈ నెలలో ప్రజాసమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించి ఆయా సమస్యల పరిష్కారం కోసం పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ కార్మికుల పరిస్థితి దారుణం గా ఉందని వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన జాగ్రత్తలు పాటించి ఉంటే ప్రమా దం జరిగి ఉండేది కాదన్నారు. ఎస్ఎల్బీసీ ఘటనపై నిపుణులతో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ముందుగా పార్టీ జెండాను సీనియ ర్ నాయకుడు బాబుసాహెబ్ ఆవిష్కరించారు. అదేవిధంగా పట్టణంలో మోటార్సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురా లు మల్లు లక్ష్మి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి నా యకులు యాదగిరిరావు, పాండు, ముల్కలపల్లి రాములు, మట్టిపల్లి సైదు లు, కోట గోపి, చెరుకు యాకలక్ష్మి, కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.