లతీఫ్ సాహెబ్ గుట్టపై మంటలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:53 AM
నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా కేంద్రంలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై శుక్రవారం రాత్రి సమయంలో మంటలు అంటుకున్నాయి.

నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా కేంద్రంలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై శుక్రవారం రాత్రి సమయంలో మంటలు అంటుకున్నాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు, పోలీస్ సిబ్బంది, ఫైర్ అధికారులతో కలిసి ఫైరింజన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైరింజన్ గుట్టపైకి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో పోలీస్, ఫైర్ సిబ్బంది, యువకులు స్వయంగా వారే శ్రమించి గుట్టపైకి చేరుకొని మంటలను ఆర్పారు. ఆకతాయిలు, యువకుల ప్రమేయంతోనే గుట్టపై మంటలు చెలరేగే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.