పవర్ప్లాంటు స్ర్కాప్ కుంభకోణంపై నీలినీడలు !
ABN , Publish Date - Jan 13 , 2025 | 12:14 AM
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటులో స్ర్కాప్ కుంభకోణం పై విచారణ అర్థంతరంగా ఆగిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవర్ప్లాంటులో చోరీలపై 2017నుంచి కేసు లు నమోదవుతున్నా పూర్తిస్థాయి విచారణ నిర్వహించకపోవ డం వెనక పెద్దమొత్తంలో ముడుపులు చేతులు మారాయ నే ఆరోపణలు వస్తున్నాయి.

విచారణను అడ్డుకుంటున్న కీలక వ్యక్తులు
ఖాకీలూ భాగస్వాములై అడ్డుకుంటున్నారనే గుసగుసలు
రూ.100కోట్ల మేర సొత్తు బయటకు వెళ్లిందనే ఆరోపణలు
జెన్కో, పోలీ్సబా్సలు దృష్టిసారించి పూర్తి విచారణ జరపాలనే డిమాండ్
(ఆంధ్రజ్యోతిప్రతినిధి- నల్లగొండ): యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటులో స్ర్కాప్ కుంభకోణం పై విచారణ అర్థంతరంగా ఆగిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవర్ప్లాంటులో చోరీలపై 2017నుంచి కేసు లు నమోదవుతున్నా పూర్తిస్థాయి విచారణ నిర్వహించకపోవ డం వెనక పెద్దమొత్తంలో ముడుపులు చేతులు మారాయ నే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్లాంటు నుంచి రూ.100 కోట్ల పైచిలుకు విలువైన సామగ్రి చోరీకి గురైనా, పూర్తిస్థాయి విచారణ నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్లో ఇటీవల జరిగిన దొంగతనాలు పోలీస్ విచారణకే పరిమితమవుతుందే తప్ప, అంతకుమించి లోతుగా జరగడం లేదని స్పష్టమవుతోంది. ఈ దందాను వెనకనుంచి నడిపించి కాసులు పోగేసుకున్న ఖాకీలే విచారణ మందగించడానికి కారణమని తెలుస్తోంది. ప్లాంటులో జరిగిన స్ర్కాప్ దొంగతనాలపై జిల్లా నిఘావిభాగం నుంచి పూర్తిస్థాయి నివేదిక ఉన్నతాధికారులకు సమర్పించినా చర్యలు చేపట్టకుండా రాష్ట్రస్థాయిలో సదరు సూత్రధారుల పెద్దలు అడ్డుకుంటున్నట్లు ఇటు జెన్కోలో, అటు పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ప్లాంటు శంకుస్థాపన నుంచి తిష్ఠవేసిన వారే..
పోలీస్, జెన్కో వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైటీపీఎ్స స్ర్కాప్ కుంభకోణం వెనక జెన్కోతోపాటు, పోలీ స్శాఖలోని అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ప్లాంటు శంకుస్థాపన సమయం నుంచి ఆ ప్రాంతంలో తిష్ఠవేసిన అఽధికారులు ఇందులో భాగస్వాములైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరి ప్రమేయంతోనే చోరీ అవుతున్న సామగ్రి పట్టుబడిన సందర్భంలో ఆ కేసును ఆ సంఘటన వరకే పరిమితం చేస్తున్నారని, పూర్తి విచారణ జరగకుండా సదరు పోలీసులు, జెన్కో అధికారులు రంగంలోకి దిగి మమ అనిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నతస్థాయిలో ఉన్న తమ పెద్దల ద్వారా వీరు విచారణ ముందుకుసాగకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరునెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఒక చోరీ సందర్భంలో విచారణ కొనసాగుతుందని పోలీ్సబాస్ పేర్కొన్నప్పటికీ, విచారణాధికారులు దాన్ని అటకెక్కించారని పేర్కొంటున్నారు. అయితే ఉన్నతాఽధికారుల సూచనల మేరకు వైటీపీఎ్సలో స్ర్కాప్ కుంభకోణంపై జిల్లా పోలీ స్ నిఘా విభాగం నుంచి పూర్తి నివేదిక వెళ్లిందని, ఈ కుంభకోణాన్ని వెనకుండి నడిపిన కీలక వ్యక్తులు ఈ నివేదికపై చర్యలు తీసుకోకుండా రాష్ట్రస్థాయిలోనూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని పోలీ్సవర్గాల్లో టాక్ కొనసాగుతోంది. జెన్కో మా జీ ముఖ్యఅధికారికి సన్నిహితులమని చెప్పుకునే ఒక పోలీసాయన ఈ మొత్తం తతంగాన్ని కొనసాగిస్తున్నారని, ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే మొత్తం కుంభకోణం వెలుగులోకి వస్తుందని, పోలీస్ ఉన్నతాధికారులు ఈమేరకు కార్యాచరణ చేపట్టాలనే సూచనలు వస్తున్నాయి.
పటిష్ఠమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ..
దాదాపు రూ.40వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లా వీర్లపాలెం వద్ద యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ని నిర్మిస్తోంది. ప్లాంట్ చుట్టూ సీసీ కెమెరాల నిఘా, పాస్లు, అనుమతి పత్రాలుంటేనే ఎవరినైనా, ఏ వాహనాన్నై నా లోపలకు గానీ, బయట కు గానీ అనుమతించేలా కట్టుదిట్టమైన భద్రతా వ్యవ స్థ కొనసాగుతోంది. ప్రత్యేకం గా సీఆర్ఎఫ్ బలగాలు.. ఇక్కడ ఒక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రత కొనసాగిస్తుంటే, మరో వైపు సివిల్ పోలీసులు తమ పర్యవేక్షణను ఏర్పాటుచేశారు. పైగా జెన్కో విజిలెన్స్ కార్యాలయం ఇక్కడే ఏర్పాటుచేసింది. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఇక్కడ విజిలెన్స్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇంత పటిష్టమైన భద్రత ఉన్న ప్రాంతంలో చిన్న బోల్ట్ పట్టుకోవాలన్నా సామాన్యులకు వెన్నులో వణుకుపుడుతుంది. అయితే ఇక్కడ భారీగా ఇనుము, అల్యూమినియం, పాత ఇనుము, రాగి, ఉక్కు, వినియోగించిన తర్వాత వదిలేసే తుక్కు పెద్ద ఎత్తున చేరుతుండడంతో దీనిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు వీటిని బయటకు తరలించి సొమ్ముచేసుకునేందుకు రంగంలోకి దిగారు. ఇక్కడ పనిచేసే కీలకమైన స్థాయిలో ఉన్న జెన్కో సిబ్బంది, బీహెచ్ఈఎల్కు చెందిన సిబ్బంది, కాంట్రాక్ట్ సంస్థల సిబ్బందితోపాటు, ఇక్కడ శంకుస్థాపన సమయం నుంచి కాచుకొని ఉన్న ఒక పోలీస్ అధికారి, భద్రతా విధుల్లో ఉండే వీరికి సానుకూలమైనవారు ఒక బృందంగా ఏర్పడి, బయట రాజకీయ పలుకుబడి, అధికార వర్గాల్లో చెలామణి అయ్యేవారితో కలిసి ఈ అక్రమ దందాను కొనసాగించారన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ పనిచేసే కార్మికులను, ఈ ప్లాంటులోకి వచ్చే వాహనాల డ్రైవర్లు, కూలీలను, కాంట్రాక్ట్ సంస్థల్లో పనిచేసే వారిని ఇక్కడినుంచి ఇనుమును బయటకు తీసుకెళ్లేందుకు వినియోగించి ప్లాన్ ప్రకారం ఈ దొంగతనాలు నిర్వహిస్తున్నట్లు చర్చ సాగుతోంది. కూలీలు, వాహనాల డ్రైవర్లు, ఆ దొంగతనంలో పట్టుబడిన వారికే కేసుని పరిమితం చేస్తున్నారే తప్ప ఈ దొంగతనాలకు మూలమైన కీలక వ్యక్తులను గుర్తించినా, ఎందుకు విచారించడం లేదనే ప్రశ్నలకు సమాధానం కొరవడింది.
సమగ్రవిచారణకు డిమాండ్
పవర్ప్లాంటులో స్ర్కాప్ కుంభకోణంలో జెన్కో, పోలీస్ సహా ఇతర విభాగాల అధికారులు, ఉద్యోగులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలనే డిమాండ్ వెలువడుతోంది. నిఘా విభాగాలు నివేదికలిచ్చినా, ఉన్నతాధికారులు స్పందించకపోవడం వెనక ఒత్తిళ్లున్నాయనే విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టాలని, జెన్కోతోపాటు పోలీస్ ఉన్నతాధికారులు ఈ స్ర్కాప్ కుంభకోణంపై పూర్తి విచారణకు ఆదేశించి వాస్తవాలను బహిర్గతం చేయాలనే డిమాండ్ వెలువడుతోంది.