Share News

శ్రీవారి అన్నప్రసాదంలో మసాలా వడ

ABN , Publish Date - Mar 07 , 2025 | 04:39 AM

తిరుమలలోని వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనంలో మసాలా వడ వడ్డింపు మొదలైంది. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు గురువారం ఉదయం భక్తులకు మసాలా వడలను వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

శ్రీవారి అన్నప్రసాదంలో మసాలా వడ

తిరుమల, మార్చి 6(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనంలో మసాలా వడ వడ్డింపు మొదలైంది. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు గురువారం ఉదయం భక్తులకు మసాలా వడలను వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా శ్రీవారి చిత్రపటం వద్ద వడలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ అన్నప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఓ పదార్థాన్ని వడ్డించాలనే ఆలోచన తనకు కలగడంతో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా అంగీకారం తెలిపారన్నారు. ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో రుచికరమైన అన్నప్రసాదాలను అందిస్తున్నామని చెప్పారు.

Updated Date - Mar 07 , 2025 | 04:39 AM