Maoists: దుర్గం గుట్టల్లో మావోయిస్టులు!
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:03 AM
పోలీసు బలగాలు కర్రెగుట్టలను చుట్టు ముడుతుండగానే.. మావోయిస్టులు పక్కనే ఉండే దుర్గం(దుర్లభమైన) గుట్టల్లోకి మకాం మార్చారా 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ గుట్టల్లోకి వెళ్లడం అత్యంత దుర్లభంగా ఉంటుందా? ఈ ప్రశ్నలకు కర్రెగుట్టల్లో కూంబింగ్లో ఉన్న కేంద్ర బలగాలు అవుననే చెబుతున్నాయి.
కర్రెగుట్టల నుంచి మకాం మార్పు!
అనుమానిస్తున్న కేంద్ర బలగాలు
అక్కడ కూడా కూంబింగ్ ప్రారంభం
కర్రె గుట్టల్లో బలగాల బేస్ క్యాంప్
గుంజిపర్తిలో సెల్ టవర్ నిర్మాణం
చర్ల, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): పోలీసు బలగాలు కర్రెగుట్టలను చుట్టు ముడుతుండగానే.. మావోయిస్టులు పక్కనే ఉండే దుర్గం(దుర్లభమైన) గుట్టల్లోకి మకాం మార్చారా? 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ గుట్టల్లోకి వెళ్లడం అత్యంత దుర్లభంగా ఉంటుందా? ఈ ప్రశ్నలకు కర్రెగుట్టల్లో కూంబింగ్లో ఉన్న కేంద్ర బలగాలు అవుననే చెబుతున్నాయి. కర్రెగుట్టల్లో కూంబింగ్ ఎనిమిదో రోజుకు చేరుకోగా.. దుర్గం గుట్టల్లో మంగళవారం నుంచి గాలింపు మొదలైంది. దుర్గం గుట్టల్లోనూ భారీ గుహలు ఉంటాయని, మార్గమధ్యంలో చిత్తడి ఊబులు ఉంటాయని స్థానిక ఆదివాసీలు చెబుతున్నారు. అటు కర్రెగుట్టల్లోనూ కూంబింగ్ కొనసాగుతోందని ఓ జవాన్ వివరించారు. ‘‘మాకున్న పక్కా సమాచారంతో 200 మంది మావోయిస్టులు ఉన్న గుట్టను చుట్టుముట్టాం. బలగాల నుంచి వారికి తప్పించుకునే అవకాశాల్లేవు. గుట్టలపైన, గుహల్లో నీటి సదుపాయం లేక.. మావోయిస్టులు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది’’ అని ఆ జవాన్ వెల్లడించారు.
కర్రెగుట్టల్లోపల ఉన్న మైదాన ప్రాంతంలో పోలీసు బలగాల తాత్కాలిక క్యాంప్ కూడా ఏర్పాటైనట్లు తెలిపారు. ఇప్పుడు జవాన్లకు అవసరమైన సామగ్రిని హెలికాప్టర్ ద్వారా చేరవేస్తున్నారు. ఆ దృశ్యాలను ‘ఆంధ్రజ్యోతి’ ఎక్స్క్లూజివ్గా సేకరించింది. కమ్యూనికేషన్ కోసం బలగాలు పూజారీ కాంకేర్ - కర్రెగుట్టలకు మధ్యన ఉండే గుంజిపర్తి అనే గ్రామంలో సెల్టవర్ను నిర్మించాయి. మంగళవారం సాయంత్రానికి సిగ్నల్ విడుదల కూడా ప్రారంభమవ్వడం గమనార్హం..! ఈ గ్రామంపై నెల క్రితం వరకు కూడా పూర్తిగా మావోయిస్టులకు పట్టు ఉండేది. కాగా.. కర్రెగుట్టల పరిసర గ్రామాలపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. గ్రామస్థులను బయటకు రాకుండా బలగాలు అడ్డుకుంటున్నాయి. కొత్తవారిని గ్రామాలకు వెళ్లనీయడం లేదు. తెలంగాణ వైపు వాజేడు, వెంకటాపురం మండలాలు, ఛత్తీ్సగఢ్ వైపు పామేడు, పూజారీ కాంకేర్ పరిసరాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన
Maryam: భారత్లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్
For Telangana News And Telugu News