సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన
ABN , Publish Date - Jan 02 , 2025 | 11:24 PM
ప్రభుత్వం తమ సమస్యలు ప రిష్కరించి రెగ్యులరైజ్ చేసే వరకు ఆందోళ కొన సాగుతూనే ఉంటుందని సమగ్ర శిక్షా అభియా న్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు.
మహబూబ్నగర్ విద్యావిభాగం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం తమ సమస్యలు ప రిష్కరించి రెగ్యులరైజ్ చేసే వరకు ఆందోళ కొన సాగుతూనే ఉంటుందని సమగ్ర శిక్షా అభియా న్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. గురువారంతో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగు లు సమ్మె 24వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నిరసన సమ్మె దీక్షా శిబిరం నుంచి అమర వీరుల స్తూపం వరకు ఉద్యోగులు పాదయాత్ర చేశారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద పూలమాలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఖాజా మైనోద్దీన్, ఎండీ ఇక్రం, గంగమ్మ, శంకరమ్మ, జ్ఞానేశ్వరి, రమాదేవి, గీతారాణి, కవిత, సువర్ణ పాల్గొన్నారు.