మహిళలు సఖి కేంద్రాల సేవలు వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2025-05-28T23:12:41+05:30 IST

సమాజంలో పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న మహిళలు సఖి కేం ద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆ కేంద్రం కార్య నిర్వాహకురాలు కవిత అన్నారు.

మహిళలు సఖి కేంద్రాల సేవలు వినియోగించుకోవాలి

వనపర్తి విద్యా విభాగం, మే 28 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న మహిళలు సఖి కేం ద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆ కేంద్రం కార్య నిర్వాహకురాలు కవిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఉర్దూ మీడియం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సఖి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణ శి బిరంలో మహిళ చట్టాలు, సఖి సేవలపై అవ గాహన కల్పించారు. సఖి కేంద్రాల్లో మహిళల కు సంబంధించిన పలు సమస్యలపై కౌన్సిలింగ్‌ నిర్వహించి వారి సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నారని వివరించారు. సఖి కేంద్రాల్లో తాత్కాలిక వసతి, వైద్య సేవలు, న్యాయ సేవ లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సమా జంలో మహిళలపై జరుగుతున్న వివక్షను దూ రం చేయాలని చెప్పారు. మహిళల హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 181ను సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాసు లు, రిసోర్స్‌ పర్సన్లు, నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ కమిటీ జిల్లా కోఆర్డినేటర్‌ సుదర్శన్‌, సుదర్శన్‌ రావు, రి సోర్స్‌ పర్సన్‌ మల్లేష్‌ కుమార్‌, సఖి కేంద్రం లీ గల్‌ కౌన్సిలర్‌ కృష్ణయ్య తదితరులు పాల్గొ న్నారు.

Updated Date - 2025-05-28T23:12:42+05:30 IST