‘హామీలు అమలు చేస్తున్నాం’..
ABN , Publish Date - Jan 20 , 2025 | 11:33 PM
కు దేలైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చే స్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూద న్రెడ్డి అన్నారు.
కొత్తకోట, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : కు దేలైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చే స్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూద న్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సం దర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ నెల 26 నుంచి అమలు కాను న్న సంక్షేమ పథకాలు, రేషన్కార్డులు, ఇంది రమ్మ ఇళ్లు నిరంతరం కొనసాగుతాయన్నారు. జాబితాలో పేరు లేదని బాధపడాల్సిన అ వసరం లేదన్నారు. గ్రామసభలో దరఖాస్తు చే సుకుంటే అధికారులు విచారణ చేసి ఆ పథకా నికి ఎంపిక చేస్తారన్నారు. అనంతరం విలియం కొండకి వెళ్లి పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. ప్రశాంత్, గొల్లబాబు తహసీ ల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో చెన్నమ్మ నాయ కులు బోయోజ్, కృష్ణారెడ్డి, బీచుపల్లి యాదవ్, శ్రీనువాసులు, బాబు, శేఖర్రెడ్డి పాల్గొన్నారు.