ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ రెండ్రోజుల్లో ముగించాలి
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:53 PM
మునిసిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి ప నులను వేగంగా పూర్తి చేయాంచాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు.

జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి ప నులను వేగంగా పూర్తి చేయాంచాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరే ట్లో గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి ము నిసిపాలిటీలకు మంజూరైన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులపై మునిసిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక సహకారంలో చేపడుతున్న అమృత్ 2.0 పఽథకం కింద చేపట్టిన స్టోరేజ్ రిజర్వాయర్, నీటి సరఫ రా పైప్లైన్ పనులను పూర్తి చేయాలన్నారు. 15వ ఫైనాన్స్, సీఎం అష్యూరెన్స్ ఫండ్, జనరల్ ఫండ్ ఇతర మునిసిపల్ నిధులతో ఇప్పటికే చేపట్టిన పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మునిసిపాలిటీ పరిధిలో అమృత్ పథకం కింద మంజూరైన పనులను వేగవంతం గా పూర్తి చేయాలని నిర్మాణ పనులకు శంకుస్థాపన కోసం సిద్ధం చేయాలన్నారు. గద్వాల ఆడిటోరియం పనులను పూర్తి చేయాలని, మునిసిపల్ పరిధిలో సీసీరోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ వంటి పనులను పూర్తి చేయాలన్నా రు. జనరల్ ఫండ్స్ ద్వారా మునిసిపల్ సిబ్బంది వేతనాలు, ఎలక్ట్రిసిటీ చార్జీలను వారం రోజుల్లో చెల్లించాలన్నారు. సీఎం అష్యూరెన్స్ మిగులు నిధులతో స మ్మర్ వాటర్ ప్లాన్ కింద వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా పనులను చేపట్టాలని, స్వచ్ఛభారత్ నిధులతో అవసరమైన చో ట్ల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా రెండు రోజుల్లో పూర్తి చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మునిసిపల్ ఈఈ విజయభాస్కర్రెడ్డి, మునిసిపల్ కమిషనర్లు, డీఈలు, ఏఈలు, తదితరులు ఉన్నారు.