మహనీయుడు ఎన్టీఆర్
ABN , First Publish Date - 2025-05-28T23:02:24+05:30 IST
తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు.
జడ్చర్ల, మే 28 (ఆంధ్రజ్యోతి) : తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో కేక్ను కట్ చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంచిపెట్టారు. కౌన్సిలర్ రమేష్, నాయకులు వెంకటయ్య, వసుంధర శ్రీను, పరమటయ్య, బాల్చెన్నయ్య, జావిద్, శ్రీశైలం, వెంకటయ్య, చెన్నకేశవులు, కృష్ణ ఉన్నారు.
హన్వాడ : మండలంలోని చిన్నదర్పల్లిలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ నాయకులు ఆయన చిత్రపటనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు బాలప్ప, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా కార్యదర్శి బోయ రాజు, నాయకులు జగన్గౌడ్, అంజి, యాదయ్య, చెన్నయ్య, శ్రీనివాస్, శ్రవన్, నారాయణ, బాలకృష్ణ పాల్గొన్నారు.
మహబూబ్నగర్ టౌన్, మహబూబ్నగర్ (వైద్యవిభాగం) : ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని గడియారం చౌరస్తాలో టీడీపీ నాయకుడు ఆర్.బాలప్ప ఆధ్వర్యంలో బుధవారం పండ్లు పంపినీ చేశారు. పేదలను ఆర్థికంగా అభివృద్థి చేసేందుకు ఎన్టీఆర్ వివిధ పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. వనగంటి శంకర్, మాలాద్రిరెడ్డి, నాయకులు చెన్నయ్య, కాసీం పాల్గొన్నారు.