సీసీరోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:06 AM
సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
చింతరేవులలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
ధరూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం ధరూరు మండల పరిధిలోని చింతరేవుల గ్రా మంలో రూ.10లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మా ణానికి ఎమ్మెల్యే భూమి చేసి పనులను ప్రారం భించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యు రాలు పద్మవెంకటేశ్వర్రెడ్డి, మాజీ వైఎస్ ఎంపీ పీ సుదర్శన్రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి.వేణుగోపాల్, నాయకులు డీఆర్ విజయ్, భగీరథ వంశీ, హనుమంతురెడ్డి, ఈశ్వ ర్, అంజిసాగర్, కార్యకర్తలు ఉన్నారు.
అంజన్నకు ప్రత్యేక పూజలు
చింతరేవుల ఆంజనేయస్వామి ఆశీస్సులతో ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఆ దివా రం ధరూరు మండలంలోని భీంపురంలో చింతరేవుల ఆంజనేయస్వామి బ్రహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించు కుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఎమ్మెల్యేకు ఆలయ వ్యవస్థాపక వంశీయులు గిరిరావు, కార్య నిర్వహణాధికారి కవిత, అర్చకు లు స్వాగతం పలికారు.