Share News

సర్వ శిక్షా అభియాన్‌ నిధులు వినియోగించాలి

ABN , Publish Date - Feb 21 , 2025 | 11:48 PM

కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లాకు మంజూరైన పీఎం శ్రీ, సర్వశిక్ష అభియాన్‌ కింద మంజూరైన నిధులను వంద శాతం ఖర్చు చేసి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు.

సర్వ శిక్షా అభియాన్‌ నిధులు వినియోగించాలి

వనపర్తి రూరల్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లాకు మంజూరైన పీఎం శ్రీ, సర్వశిక్ష అభియాన్‌ కింద మంజూరైన నిధులను వంద శాతం ఖర్చు చేసి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ అధికారులు, ప్రధానోపా ధ్యాయులతో కేంద్ర ప్రభుత్వ నిధుల వినియో గంపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ, సర్వశిక్ష అభియాన్‌ కింద ప్రతీ సంవత్సరం పా ఠశాలలో మౌలిక వసతులు, క్షేత్రస్థాయి పరిశీల నల కోసం విడుదలైన నిధులు ఖర్చు చేసి యూటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ పంపాలని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ సమీక్ష నిర్వహిస్తు గ్రీన్‌ స్కూల్‌, ఆత్మరక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన, మౌ లిక సదుపాయాలు, స్పోర్ట్స్‌, సైన్స్‌ బడ్జెట్‌ విని యోగంపై సమీక్షించారు. జిల్లా విద్యాశాఖ అధి కారి అబ్దుల్‌ ఘనీ, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 11:48 PM