ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:23 PM
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు.

కలెక్టర్ బీఎం సంతోష్
ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
గద్వాలన్యూటౌన్, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల స ముదాయ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెం డింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.