Share News

పర్యాటకానికి అనువైన ప్రాంతం మల్లేశ్వరం ఐలాండ్‌

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:32 PM

నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని మల్లేశ్వ రం ఐలాండ్‌ పర్యాటకాని కి అనువైన ప్రదేశమని కలెక్టర్‌ బదావత్‌ సంతో ష్‌ అన్నారు.

 పర్యాటకానికి అనువైన ప్రాంతం మల్లేశ్వరం ఐలాండ్‌
మల్లేశ్వరం కృష్ణానది మధ్యలో ఉన్న ఐలాండ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

పెంట్లవెల్ల్లి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని మల్లేశ్వ రం ఐలాండ్‌ పర్యాటకాని కి అనువైన ప్రదేశమని కలెక్టర్‌ బదావత్‌ సంతో ష్‌ అన్నారు. సోమవారం కొల్లాపూర్‌ మండలంలోని సోమశిల నుంచి టూరి జం లాంచ్‌లో నల్లమల్ల అటవీ ప్రాంతంలోని మల్లేశ్వరం ఐలాండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణానది శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ మధ్యలో ఉన్న మల్లేశ్వరం ఐలాండ్‌ పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయ డానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐలాండ్‌ కూడా ఒక ముఖ్య పర్యాటక ప్రాంతంగా గుర్తించబడిందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో జిల్లాలోని పలు సందర్శనీయ స్థలాలను పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జయంతి, ఎఫ్‌ఆర్‌ వో చంద్రశేఖర్‌, టూరిజం జిల్లా అధికారి కల్వరాల నర్సింహ్మ, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహ్మ యాదవ్‌, నాయకులు ఉన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 11:33 PM