హైమాస్ట్ లైట్లు ప్రారంభం
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:27 PM
మండలంలోని కొత్తపేట, మాధారం గ్రామాల్లో ఆదివారం ఎంపీ డీకే అరుణ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను బీజేపీ మండల నాయకులు ప్రారంభించారు.

హన్వాడ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొత్తపేట, మాధారం గ్రామాల్లో ఆదివారం ఎంపీ డీకే అరుణ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను బీజేపీ మండల నాయకులు ప్రారంభించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ఎంపీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. అదే విధంగా మాధారంలో మండల అధ్యక్షుడు వెంకటయ్య లైట్లను ప్రారంభించి మాట్లాడారు. నాయకులు కొండ లింగన్న, కుర్మిరెడ్డి, చెన్నప్ప, రాములు, శ్రీను, కేశవులు, శేఖర్, చింటు పాల్గొన్నారు.
బాలానగర్ : మండలంలోని సూరారంలో ఎంపీ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లను ఆదివారం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ నరసింహులు ప్రారంభించారు. నాయకులు రాపోతుల శ్రీనివాస్గౌడ్, శ్రీశైలం, లక్ష్మణ్, రాజు, గోపాల్నాయక్, మహాలక్ష్మి, సాదాశివారెడ్డి పాల్గొన్నారు.